CM Jagan: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: సీఎం జగన్
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని.. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువ ఉన్న
పి.గన్నవరం: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని.. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువ ఉన్న చోట బడులు తెరిచామని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తూర్పుగోదావరి జిల్ల పి.గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత ‘నాడు-నేడు’తో ఆధునికీకరణ సంతరించుకున్న పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు. అనంతరం ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తరగతి గదిలో 20 మంది కంటే ఎక్కువ ఉంచొద్దన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
విద్యార్థులకు పుస్తకాలు సహా అన్ని వస్తువులు అందజేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యాకానుక కింద రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, బ్యాగు అందిస్తున్నామని.. ప్రతి విద్యార్థికీ నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు వివరించారు. విద్యాకానుక కిట్ల నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది రూ.1,380 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో 42లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ‘నాడు-నేడు’ రెండో దశకు నేటి నుంచే శ్రీకారం చుడుతున్నట్లు జగన్ చెప్పారు. నాడు-నేడుతో ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయని జగన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!