Batukamma: రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి... ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తుందని చెప్పారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం... తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని అన్నారు.
దాదాపు రూ.350 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చీరలను వారికి బతుకమ్మ కానుకగా అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల జీవనంలో భాగమైన ‘బతుకమ్మ’ ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని సీఎం ఆకాంక్షించారు.
పువ్వులను పూజించే గొప్ప పండుగ: సత్యవతి రాథోడ్
రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ అని ఆమె అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని ఆమె చెప్పారు.
ఆడబిడ్డలకు ఇష్టమైన పండగ: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు. ఆడబిడ్డలకు ఇది ఎంతో ఇష్టమైన పండగ అని, తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా తీరొక్క పువ్వుతో జరిగే ఈ సంబురాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్