కాశీ విశ్వేశ్వరుడి సేవలో కేసీఆర్‌ కుటుంబం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శోభ, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత,

Published : 30 Jan 2021 01:12 IST

వారణాసి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి కల్వకుంట్ల శోభ, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. గురువారం వారణాసి చేరుకున్న వీరంతా పలు దేవాలయాలను సందర్శించారు. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దుందిరాజ్‌ ఆలయంలో గణేశుడికి ప్రత్యేక పూజల అనంతరం వారాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు. 

ఇవీ చదవండి..
ప్రపంచానికే గొప్ప ఆస్తి భారత్‌ : ఐరాస

దిల్లీ-యూపీ సరిహద్దుల్లో ఉద్రిక్తత
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని