Cm Kcr: ఏ తెలంగాణను కోరుకున్నామో అది సాకారమవుతోంది: సీఎం కేసీఆర్
ఏ తెలంగాణను కోరుకున్నామో అది సాకారమవుతోందని.. అద్భుతమైన లక్ష్యం దిశగా సాగుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏదైనా సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు.
మహబూబ్నగర్: ఏ తెలంగాణను కోరుకున్నామో అది సాకారమవుతోందని.. అద్భుతమైన లక్ష్యం దిశగా సాగుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏదైనా సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తెరాస జిల్లా కార్యాలయంతో పాటు కలెక్టరేట్ను ఆయన ప్రారంభించారు. తెరాస జెండా ఎగురవేసి.. నూతన కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేతలతో సీఎం కాసేపు ముచ్చటించారు.
‘‘పీవీ నరసింహారావు నెలకొల్పిన సర్వేల్ గురుకులం ఎంతో గర్వకారణం. పీవీ స్ఫూర్తితోనే ఇప్పుడు మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. కంటి వెలుగు పథకం వెనక ఎంతో పరమార్థం ఉంది. ఈ పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదు. అధికారులు అంకితభావంతో కంటివెలుగును విజయవంతం చేయాలి. ఏ పథకం తెచ్చినా.. సమగ్ర చర్చ, ఒక దృక్పథం ఉంటుందని తెలుసుకోవాలి. కేసీఆర్ కిట్ కూడా ఆషమాషీగా తెచ్చింది కాదు. మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో వారు ఆదాయం కోల్పోవద్దనే డబ్బు ఇస్తున్నాం. గర్భిణీలు డబ్బు, కూలీ గురించి ఆలోచించొద్దని భావించాం. టీకాలను నిర్లక్ష్యం చేయొద్దనే టీకాలు వేయిస్తే డబ్బులిస్తున్నాం. సామాజిక, మానవీయ దృక్పథంతో పథకాలు తీసుకొస్తున్నాం. సంస్కరణలు నిరంతర ప్రక్రియ. ఒక దశతో ముగిసేవి కావు. తెలంగాణ చిమ్మచీకటి అవుతుందని శపించిన వారూ ఉన్నారు. అందరి అంచనాలు తలకిందులు చేసి అద్భుత ప్రగతి సాధిస్తున్నాం. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలు అందించిన సహకారం భవిష్యత్లోనూ కొనసాగించాలి’’ అని సీఎం కేసీఆర్ కోరారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించే సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్