CM KCR: కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన.. పనుల పురోగతిపై సీఎం సమీక్ష
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన కొనసాగుతోంది. ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన కొనసాగుతోంది. ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, సమీప ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అధికారులతో సమీక్ష అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని సీఎం దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కేసీఆర్ విరాళంగా సమర్పిస్తారు. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పసిడి సమర్పించారు. తానూ కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం.. ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు. మరోవైపు దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో సీఎం యాదగిరిగుట్ట పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం