ఆర్టీసీ బస్సులో ‘అనంత’ కలెక్టర్‌ 

అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పాఠశాల విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొంచిరెడ్డిపల్లి గ్రామం నుంచి మండలకేంద్రంమైన.....

Updated : 22 Jan 2021 15:56 IST

అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పాఠశాల విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గొంచిరెడ్డిపల్లి గ్రామం నుంచి మండల కేంద్రంమైన బ్రహ్మసముద్రం వరకు ఆయన బస్సులో వెళ్లారు. గ్రామం నుంచి మండల కేంద్రంలో ఉన్న పాఠశాల వరకు వెళ్లేందుకు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ తల్లిదండ్రులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన  కలెక్టర్‌ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసు ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా గొంచిరెడ్డిపల్లిలో బస్సును ప్రారంభించిన ఆయన‌.. అందులోనే ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు.

ఇదీ చదవండి..

అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని