Vanga Geetha: అక్రమంగా ఆస్తులు రాయించుకున్నారు.. ఎంపీ వంగా గీతపై వదిన ఫిర్యాదు

తమ ఆస్తులను ఎంపీ వంగా గీత బలవంతంగా రాయించుకున్నారంటూ ఆమె వదిన కళావతి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 05 Jun 2023 17:46 IST

కాకినాడ: కాకినాడ లోక్‌సభ వైకాపా ఎంపీ వంగా గీతపై స్పందన కార్యక్రమంలో ఆమె వదిన కళావతి ఫిర్యాదు చేశారు. 2006లో తన భర్త కృష్ణకుమార్‌తో తమ ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వంగా గీత సోదరుడు కృష్ణకుమార్‌ 2010లో మృతి చెందారు. తాజాగా వంగా గీత, ఆమె సోదరి కుసుమకుమారి దంపతులపై కళావతి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు కోర్టులో పోరాడుతుంటే బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు ఆమె విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని