TS News: జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి: సీఎస్
రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగ్ల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా జిల్లా కేడర్ ఉద్యోగుల పోస్టింగ్ల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 22,418 మంది ఉపాధ్యాయులకు గాను సాయంత్రం 6గంటల వరకు 21,800 మంది కొత్త స్థానాల్లో చేరారని, మిగిలిన ఉపాధ్యాయులు కూడా అర్ధరాత్రి లోపు విధుల్లో చేరుతారని పేర్కొంది. 13,760 మంది జిల్లా స్థాయి ఇతర ఉద్యోగులు కూడా కొత్త స్థానాల్లో చేరినట్టు తెలిపింది. జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందన్న రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి వరకు వారి పోస్టింగ్ల ప్రక్రియకూడా పూర్తవుతుందని పేర్కొంది. విస్తృత ప్రక్రియను స్వల్పకాలంలోనే పూర్తి చేయడం గొప్ప విషయమన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసిన అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పక్రియ పూర్తి చేసేందుకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుతో ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం అవకాశాలు దక్కుతాయని సీఎస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM