Telangana News: ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి అల్లుడి వాహనంపై రాళ్లదాడి

నిజామాబాద్‌ జిల్లాలో తెరాసకు చెందిన ఇద్దరు నేతల మధ్య భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారిసింది. నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో బుధవారం భూ వివాదం...

Updated : 02 Mar 2022 19:21 IST

నిజామాబాద్‌ నేరవార్తలు: నిజామాబాద్‌ జిల్లాలో తెరాసకు చెందిన ఇద్దరు నేతల మధ్య భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారిసింది. నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో బుధవారం భూ వివాదం చోటు చేసుకుంది. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి అల్లుడు సంపత్‌, నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌ భర్త శేఖర్‌ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. దీంతో శేఖర్‌ అనుచరులు సంపత్‌ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. శేఖర్‌ అనుచరులపై నిజామాబాద్‌ ఐదో ఠాణాలో సంపత్‌ ఫిర్యాదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని