Telangana News: కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష.. రేపట్నుంచి హాల్‌టికెట్ల జారీ

తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌ టికెట్ల జారీకి రంగం సిద్ధమైంది. ఈనెల 28న

Published : 17 Aug 2022 20:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌ టికెట్ల జారీకి రంగం సిద్ధమైంది. ఈనెల 28న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను రేపట్నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. రేపు ఉదయం 8 నుంచి ఈనెల 26వ తేదీ రాత్రి వరకు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదలైంది. మరో 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 28న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్‌ పరీక్షలకు 1601 పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని