DRDO: నిర్మాణ రంగంలో డీఆర్డీఓ అద్భుతం.. 45రోజుల్లో 7 అంతస్తుల భవనం
రక్షణ పరిశోధన అభివృధ్ధి సంస్ధ(డీఆర్డీవో) మరో మైలు రాయి సాధించింది. కేవలం 45 రోజుల వ్యవధిలో ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. డీఆర్డీవో సొంతంగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ టెక్నాలజీని ..
హైదరాబాద్: రక్షణ పరిశోధన అభివృధ్ధి సంస్ధ(డీఆర్డీవో) మరో మైలు రాయి సాధించింది. కేవలం 45 రోజుల వ్యవధిలో ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మించింది. డీఆర్డీవో సొంతంగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రీకాస్ట్ విధానంలో భవాన్ని బెంగళూరులో నిర్మించింది. అధునాతన యుద్ధ విమానాలు, మానవ రహిత విమానాల అభివృద్ధి, పరిశోధనల కోసం ఈ భవనాన్ని నిర్మించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఈ భవనాన్ని ప్రారంభించారు.
ప్రీ ఇంజినీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో నిర్మాణాన్ని గతేడాది నవంబరు 22న ప్రారంభించారు. స్ట్రక్చరల్ ఫ్రేమ్ కాలమ్, బీమ్లను స్టీల్ ప్లేట్లతో నిర్మించారు. స్లాబ్లు పాక్షికంగా ముందే సిద్ధం చేసి ఉంచారు. అన్నీ తీసుకొచ్చి చక చకా అమర్చడంతో ఫిబ్రవరి 1 నాటికి పూర్తి చేశారు. 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనం 45 రోజుల్లో పూర్తి చేయడంతో డీఆర్డీవో కొత్త రికార్డు సృష్టించింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారమే విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రొటెక్షన్, ఎయిర్ కండిషనింగ్ విధానం అమర్చారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు డిజైన్, సాంకేతిక సహాయాన్ని అందించాయి. సంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే హైబ్రిడ్ టెక్నాలజీతో సమయం, శ్రమ తగ్గుతుందని డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో బృందాన్ని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్