పరీక్ష కోసం.. ఆ గర్భిణి 1200 కిలో మీటర్లు..
లాక్డౌన్ సడలింపుల అనంతరం కూడా ప్రజలకు రవాణా తిప్పలు..
స్కూటర్పై రెండు రోజుల ప్రయాణం
గ్వాలియర్: లాక్డౌన్ సడలింపుల అనంతరం కూడా ప్రజలకు రవాణా తిప్పలు తప్పడం లేదు. ఫలితంగా పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ గర్భిణి స్కూటర్పై ఏకంగా 1200 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్షా కేంద్రానికి చేరుకోవడం గమనార్హం. రెండు రోజులపాటు ప్రయాణించి భర్త ఆమెను అతి కష్టం మీద గమ్యస్థానానికి చేర్చాడు. ఝార్ఖండ్లోని గడ్డా జిల్లాకు చెందిన ఏడు నెలల గర్భిణి ఉత్తర ప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు(డీఈఐఈడీ) పరీక్ష రాయాల్సి ఉంది. సరైనా రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో 1200 కి.మీ. దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు భర్త ధనుంజయ్ కుమార్తో ద్విచక్రవాహనంపై బయలు దేరింది. రెండు రోజుల ప్రయాణంలో వారు ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలను దాటి చివరకు యూపీలోని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆ రెండు రోజుల ప్రయాణంలో వారు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. బిహార్లోని వరదలను దాటుకుంటూ వెళ్లారు. అనేక ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ ముందుకు సాగారు.
ధనుంజయ్ ఓ క్యాంటీన్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అంత దూరం రాకపోకలకు వాహనంలో పెట్రోలు కోసం భార్య నగలను తాకట్టు పెట్టాడు. ప్రయాణంలో ఓ రాత్రి టోల్ ప్లాజా వద్ద ఆశ్రయం పొందారు. తాను 8వ తరగతి వరకే చదువుకున్నాని, భార్యను ఉపాధ్యాయురాలిగా చూడాలని ఉందని ధనుంజయ్ తెలిపాడు. భార్య జ్ఞాపకార్థం పర్వతాన్ని తవ్వి రోడ్డు నిర్మించిన దశరథ్ మాంజీనే తనకు ప్రేరణ అని తెలిపాడు. ‘ప్రయాణ సమయంలో పలుమార్లు నా కాళ్లు మొద్దుబారాయి. నడుము, కడుపులో నొప్పి వచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు’ అని భార్య సోనీ తెలిపింది. భర్తకు ధన్యవాదాలు తెలుపుతూ టీచర్ అవ్వడం తన కలగా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్