మైనర్కు బండి.. డేంజరండి
లైసెన్స్ లేకుండా వాహనం నడపడమే నేరం. అలాంటిది లైసెన్స్ పొందే అర్హత లేనివాళ్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. బండి నడపడం వస్తే చాలు ఏం కాదులే అనుకొని కొందరు తల్లిదండ్రులు వాహనం ఇచ్చేస్తున్నారు....
ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు బలిగొంటున్న వైనం
ఇంటర్నెట్ డెస్క్: లైసెన్స్ లేకుండా వాహనం నడపడమే నేరం. అలాంటిది లైసెన్స్ పొందే అర్హత లేనివాళ్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. బండి నడపడం వస్తే చాలు ఏం కాదులే అనుకొని కొందరు తల్లిదండ్రులు వాహనం ఇచ్చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు ప్రమాదాలబారిన పడడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మైనర్ల డ్రైవింగ్ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డెక్కితే చాలు లైసెన్స్కు అర్హత లేని పిల్లల డ్రైవింగ్ దృశ్యాలు కళ్లెదుటే కనిపిస్తాయి. కార్యాలయాల్లో దింపేందుకు ఉద్యోగులు తమ పిల్లలకు వాహనం అప్పగించడం, బజారుకు వెళ్లి సరుకులు తెచ్చేందుకో, ఇతర పనుల కోసం బండి ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. పిల్లల నిర్లక్షపు డ్రైవింగ్తో ప్రమాదాల బారిన పడడమే కాకుండా, ఇతరులను సైతం ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ఒకే బండిపై ముగ్గురు ప్రయాణిస్తూ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాల నుంచి తప్పించుకునేందుకు గల్లీల్లో దూసుకెళుతున్నారు.
మైనర్ల డ్రైవింగ్ వల్ల రోజురోజుకు పెరిగిపోతున్న ప్రమాదాలతో పాలమూరులో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం లైసెన్స్ లేనందుకు జరిమానాలు విధిస్తున్నారు. వారి తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి పోలీసు స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఇవేకాకుండా కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు, లేజర్ గన్, సామాజిక మాధ్యమాలు, సిగ్నల్ జంప్ల ద్వారా మైనర్ డ్రైవర్లను గుర్తించి ఛలాన్లు విధిస్తున్నారు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మోటారు వాహన సవరణ చట్టం 2019 ప్రకారం భారీ జరిమానాలు విధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?