TS News: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 482 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated : 03 Jan 2022 20:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 482 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,971కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,031కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 212 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 423 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 23 మంది ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 84కి చేరింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 37 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 13,272 మంది తెలంగాణకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని