Hyderabad: పోలీసుశాఖను వెంటాడుతోన్నమహమ్మారి.. ఒక్కరోజే 72 మంది పోలీసులకు కొవిడ్
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా..
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా.. వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మహమ్మారి ప్రభుత్వ కార్యాలయాలపైనా విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో పోలీసు శాఖ నుంచి అధికంగా ఉంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న పలు పోలీసు స్టేషన్లలో కలిపి మొత్తంగా 72 మంది పోలీసులు వైరస్ బారినపడ్డారు. తాజాగా హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఇటీవల సైబర్ క్రైమ్ బృందం ఓ కేసు విషయంలో రాజస్థాన్ వెళ్లి వచ్చింది. ఆ బృందంలోని ఒక ఎస్సైకి కరోనా పాజిటివ్గా తేలింది. అతని నుంచి మిగతా సిబ్బందికి సోకినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది ప్రస్తుతం హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్లలో ఒక్కరు చొప్పున, అల్వాల్ పీఎస్లో నలుగురు కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో ఏసీపీ, సీఐ సహా 12 మందికి ఈ వైరస్ సోకిన విషయం తెలిసిందే.
నార్సింగి పోలీసు స్టేషన్లో 20 మందికి..
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీసు స్టేషన్లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్ బారినపడటంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదుదారుల కోసం పోలీసుస్టేషన్ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.
హయత్నగర్ పీఎస్లో 15 మందికి..
నగరంలోని హయత్నగర్ పోలీసుస్టేషన్లో 15 మంది పోలీసులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న ఎస్ఐ, మరో 14 మంది కానిస్టేబుళ్లు వైరస్ బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.
చైతన్యపురి పోలీసు స్టేషన్లో..
నగరంలోని చైతన్యపురి పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న 8 మంది కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో పోలీసులు పీఎస్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
బీఆర్కే భవన్లో..
బీఆర్కే భవన్లో కరోనా కలకలం రేగింది. బీఆర్కే భవన్లోని సాధారణ పరిపాలన, విద్యాశాఖ సహా పలు విభాగాలకు చెందిన 15 మంది ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఐఏఎస్ అధికారులు, పలు విభాగాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
తెలంగాణ నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!