TS NEWS: కొత్తగా 869 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,123 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 869 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల

Published : 01 Jul 2021 18:11 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,123 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 869 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,669కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,197 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 101 కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని