TS Corona: తెలంగాణలో 500కు చేరువగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 28,808 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 496 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు

Published : 25 Jun 2022 19:31 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 28,808 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 496 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. నిన్న కరోనా మహమ్మారి నుంచి 205 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.03 శాతంగా ఉంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 3,613 ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 341 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రంగారెడ్డిలో 68, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 40, సంగారెడ్డిలో 15 కేసులు వెలుగు చూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని