అయినవారిని తీసుకెళ్తూ.. అనాథలుగా మారుస్తూ..
కరోనా మహమ్మారితో చూస్తుండగానే భర్త ఊపిరి ఆగింది. కట్టుకున్నవాడి మరణం నుంచి తేరుకోకముందే ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మామయ్య కాలం చేశాడు. గుండెలవిసేలా ఏడుస్తుండగానే మరిదిని మహమ్మారి కబళించింది....
అరణ్య రోదనగా మారుతున్న ఆ కుటుంబాల వేదన
జగిత్యాల: చూస్తుండగానే భర్త ఊపిరి ఆగింది. కట్టుకున్నవాడి మరణం నుంచి తేరుకోకముందే ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మామయ్య కాలం చేశాడు. గుండెలవిసేలా ఏడుస్తుండగానే మరిదిని మహమ్మారి కబళించింది. అయినవారు ఒక్కొక్కరుగా కళ్లముందే దూరమవుతుంటే... కన్నీళ్లు రాల్చటం తప్పిస్తే మరేమీ చేయలేని దైన్యం. నరకమంటే బహుశా ఇలాంటి కుటుంబాలు అనుభవించిన వేదనే అయింటుంది.
జగిత్యాలలోని గణేశ్నగర్కు చెందిన దొంతుల సునీల్ ఇటీవల కరోనా బారిన పడి ప్రాణాలు విడిచాడు. మరో రెండ్రోజులకే ఆయన తండ్రి రామచంద్రం.. అంతలోనే సోదరుడు సుమన్ కరోనా మహమ్మారి కాటుకు బలయ్యారు. వారంరోజుల వ్యవధిలోనే ముగ్గురూ మృతిచెందగా కనీసం అంత్యక్రియలు కూడా చేసే వారు లేని పరిస్థితి నెలకొంది. కట్టుకున్న భర్త.. పెద్దదిక్కుగా ఉన్న మామ, బిడ్డలాంటి మరిది కళ్లముందే ప్రాణాలు వదలడంతో సునీల్ భార్య వేదన అరణ్యరోదనగా మారింది. అనాథలుగా మారిపోయామని.. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆమె ఆవేదన వెల్లగక్కుతున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి..
జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్కు చెందిన ఎర్ర రాజేశం దంపతులతోపాటు ఆయన సోదరుడు కరోనా కాటుకు బలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన పందిరి భీమిలింగం, ఆయన భార్య వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో మిగిలిన భీమలింగం కుమారుడు, వృద్ధులైన ఆయన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా కాటుకు తమవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి.
జగిత్యాల జిల్లాలోనే నెల రోజుల వ్యవధిలో 500 మందికి పైగా మృత్యువాతపడగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. లక్షల రూపాయలు ఖర్చుచేసినా ప్రాణాలు దక్కకపోవడంతో బాధితులంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు