ఫోన్‌ మాట్లాడుతూ టీకా.. నర్సుకు షోకాజ్‌ నోటీసు! 

విజయనగరం జిల్లాలో ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేసిన ఓ నర్స్‌ ఫొటో వైరల్‌గా మారింది. జిల్లాలోని పార్వతీపురం....

Updated : 10 Apr 2021 18:52 IST

పార్వతీపురం: ఫోన్‌ మాట్లాడుతూ టీకా వేసిన ఓ నర్సు‌కు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురంలో చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుకుంటూ టీకా వేస్తున్న నర్సు హేమలత ఫొటో ప్రచారంలోకి రావడంతో వ్యాక్సిన్‌ వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో నర్సుకు జిల్లా వైద్యశాఖ అధికారిణి రమణకుమారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని