బెంగళూరులో వేగంగా కరోనా ఉత్పరివర్తన
జాతీయ కరోనా ఉత్పరివర్తన రేటులో పోల్చుకుంటే బెంగళూరులో మ్యుటేషన్ల రేటు ఎక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది.
దేశ సగటు కంటే ఎక్కువన్న పరిశోధకులు
దిల్లీ: జాతీయ కరోనా ఉత్పరివర్తన సగటు రేటుతో పోల్చుకుంటే బెంగళూరులో మ్యుటేషన్ల రేటు ఎక్కువగా ఉందని తేలింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రొటీమ్ రీసెర్చ్ జర్నల్లో ఈ పరిశోధన ప్రచురితమైంది. బెంగళూరులో 27 మ్యుటేషన్లను గుర్తించగా.. ఒక్కో శాంపిల్కు సగటున 11 ఉత్పరివర్తనాలు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. జాతీయ ఉత్పరివర్తనాల సగటు రేటు (8.4), ప్రపంచ సగటు (7.3) కంటే ఇది ఎక్కువ అని పేర్కొన్నారు.
బెంగళూరు నగరంలో కరోనా సోకిన వ్యక్తుల ముక్కు నుంచి నమూనాలను సేకరించి పరీక్షించామని పరిశోధకులు తెలిపారు. వాటికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఏ విధంగా ఉత్పరివర్తనం చెందుతున్నాయో గమనించామన్నారు. వాటిల్లో రోగనిరోధక శక్తిని క్షీణింపజేసే కణాలతో పాటు ఇంతకు ముందెన్నడూ గుర్తించని 13 వేర్వేరు ప్రొటీన్ కణాలను గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఈ పరిశోధన కోసం నెక్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) విధానాన్ని వినియోగించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ విధానం ద్వారా కరోనా వైరస్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని గుర్తించే వీలుంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఉత్పల్ తాతు తెలిపారు. వైరస్లో వచ్చే ఈ మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203