డే లైట్ సేవింగ్ టైమ్ గురించి తెలుసా..?
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటుంది. ఇందుకు 24గంటల సమయం పడుతుంది. దీన్నే మనం ఒక రోజుగా పరిగణిస్తున్నాం. ఒక్క రోజులో సగం పగలు.. సగం రాత్రి ఉంటుంది. అయితే ప్రాంతాల్ని బట్టి పగలు, రాత్రిలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ ప్రకృతి.. కాల క్రమాన్ని
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాంతాల్ని బట్టి పగలు, రాత్రిలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ఏటా రెండు సార్లు గడియారంలో కాలాన్ని మార్చేస్తుంటాయి. ఎందుకో తెలుసా..?
భూమధ్య రేఖకు కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు పగలు, రాత్రి దాదాపు 12 గంటల చొప్పున సమంగా ఉంటాయి. మిగతా దేశాల్లో పగటి సమయం వేసవికాలంలో ఎక్కువగానూ, శీతాకాలంలో తక్కువగానూ ఉంటుంది. దీంతో పగటి పూటను ప్రజలు ఎక్కువసేపు ఆస్వాదించడం కోసం ‘డే లైట్ సేవింగ్ టైం’ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఏటా వేసవి కాలం (మార్చి చివరి ఆదివారం) గడియారంలో ఉండే అంతర్జాతీయ ప్రామాణిక సమయాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. శీతాకాలం ప్రారంభం (అక్టోబర్ చివరి వారం)లో మళ్లీ వెనక్కి జరిపి యథాస్థితికి తీసుకొస్తారు.
సాధారణంగా ఉద్యోగులు, కార్మికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తారు. వేసవికాలంలో సమయాన్ని గంట ముందుకు జరపడం వల్ల ఉదయం 8 గంటల నుంచి 4 గంటల మధ్య పని చేసి తొందరగా ఇంటికి వెళ్తారు (గడియారం పరంగా 9am-5pm పనివేళలే). సాయంత్రం ఇంకా వెలుగు ఉంటుంది కాబట్టి కుటుంబంతో బయటకు విహారానికి వెళ్తారు. తద్వారా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాల వినియోగం తక్కువవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే సాయంత్రం వేళ విహారానికి వెళ్లే కుటుంబాల వల్ల మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతాయి. అలా ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఈ ఉద్దేశంతోనే పలు దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
ఈ ‘డే లైట్ సేవింగ్ టైం’ను 1895లో జార్జ్ హడ్సన్ అనే కీటకాల శాస్త్రవేత్త ప్రతిపాదించారు. తన కార్యాలయంలో పని పూర్తికాగానే కీటకాల వేటకు వెళ్లేవాడట. కానీ, పనివేళలు ముగిసేసరికి కొన్ని సార్లు చీకటి పడుతుండటంతో గడియారంలో సమయాన్ని గంట వెనక్కి జరిపితే సాయంత్రం వేళ వెలుగు ఉన్నప్పుడు వేటకు వెళ్లొచ్చని భావించాడు. అందుకే ‘డే లైట్ సేవింగ్ టైం’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే, అంతకుముందే అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు బెంజిమన్ ఫ్రాంక్లిన్ 1784లో ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు ఓ వాదన ఉంది. కొవ్వొత్తుల వినియోగం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాటి కొనుగోళ్లు, ఖర్చులు తగ్గించడం కోసం దీనిని తీసుకొచ్చారట.
తొలిసారి 1916లో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీలు, ఆ తర్వాత యూరప్, అమెరికా ఈ విధానాన్ని అమలు చేశాయి. రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ ఈ విధానాన్ని ఇంధనం, సైనిక శక్తిని పొదుపు చేయడం కోసం బాగా ఉపయోగించుకుంది. అయితే ఈ ‘డే లైట్ సేవింగ్ టైం’ విధానం తప్పనిసరి కాదు. కానీ, 70కి పైగా దేశాలు పాటిస్తున్నాయి. భారత్ సహా ఆసియా, ఆఫ్రికా దేశాలు దీన్ని పాటించట్లేదు. అమెరికాలోనూ కొన్ని ప్రాంతాలు ఈ ‘డే లైట్ సేవింగ్ టైం’కు దూరంగా ఉంటున్నాయి. అప్పట్లో అయితే.. లైట్లు, ఫ్యాన్లు, ఆ నాటి విద్యుత్ పరికాల వినియోగం తగ్గించి, విద్యుత్ ఆదా కోసం ఈ విధానం అమలు చేశారు. ప్రస్తుతం 24 గంటలూ ఏదో విధంగా విద్యుత్ వినియోగం ఉంటోంది. మరి ఈ విధానం వల్ల లాభం ఉందా అంటే? ఉందని కొందరు.. లేదని కొందరు వాదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా