బ్లాక్ ఫంగస్ మందు పంపిణీ విధానాన్ని రూపొందించండి
దేశంలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు వినియోగించే యాంఫోటెరిసిన్-బి ఔషధం పంపిణీకి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాలకు దిల్లీ హైకోర్టు సూచించింది.
కేంద్రం, కేజ్రీవాల్ సర్కారుకు దిల్లీ హైకోర్టు సూచన
దిల్లీ: దేశంలో రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు వినియోగించే యాంఫోటెరిసిన్-బి ఔషధం పంపిణీకి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాలకు దిల్లీ హైకోర్టు సూచించింది. ఈ ఔషధం కొరత ఉన్నంత వరకు పంపిణీకి నిర్దిష్ట వయసు వారిని మినహాయిస్తూ కఠిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మందును ఇచ్చే నిర్ణయాధికారాన్ని వైద్యులకు వదిలేయొద్దని తెలిపింది. 80 ఏళ్లు, 35 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు బ్లాక్ ఫంగస్తో బాధపడుతుండగా కేవలం ఒక డోసే అందుబాటులో ఉంటే.. ఆ మందును ఎవరికి ఇవ్వాలో తెలపాలంటూ ఓ ఉదాహరణను వివరించింది. అయితే ఏ వ్యక్తి ప్రాణమైనా మరో వ్యక్తి కంటే తక్కువని చెప్పడం తమ ఉద్దేశం కాదని న్యాయమూర్తులు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితమూ ప్రధానమేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.