Corona: జంతువుల మధ్య కనిపించని కొవిడ్ వ్యాప్తి!
కొవిడ్ బారిన పడ్డ యజమానులకు చెందిన పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా సార్స్ 2 కొవిడ్-19 వైరస్ ఎక్కువగానే సోకుతోందని ‘యూరోపియన్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజస్’కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది. రెండు నుంచి 200 రోజుల లోపు కొవిడ్ సోకిన 196 మంది యజమానుల ఇళ్లను నెదర్లాండ్స్కు చెందిన ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం సందర్శించింది.
మనుషుల నుంచి జంతువులకే కొవిడ్ వ్యాప్తి!
కొవిడ్ బారిన పడ్డ యజమానులకు చెందిన పెంపుడు పిల్లులు, కుక్కలకు కూడా సార్స్ 2 కొవిడ్-19 వైరస్ ఎక్కువగానే సోకుతోందని ‘యూరోపియన్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజస్’కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది. రెండు నుంచి 200 రోజుల లోపు కొవిడ్ సోకిన 196 మంది యజమానుల ఇళ్లను నెదర్లాండ్స్కు చెందిన ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం సందర్శించింది. వారి ఇళ్లల్లోని 156 కుక్కలు, 154 పిల్లుల నుంచి రక్త నమూనాలు, గొంతు నుంచి స్వాబ్ను సేకరించారు. ఆ తర్వాత ఆ స్వాబ్లకు పీసీఆర్, రక్తనమూనాలకు యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు. అందులో ఆరు పిల్లులు, ఏడు కుక్కలకు(4.2శాతం) పీసీఆర్ టెస్టులో కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అలాగే 31 పిల్లులు, 23 కుక్కల (17.4శాతం) రక్తంలోయాంటీబాడీలు కనిపించాయి. ఆ తర్వాత మరో 11 జంతువులకు రెండోసారి టెస్టులు చేసినప్పుడు వాటిలోనూ యాంటీబాడీలు కనిపించాయి. మూడోసారి టెస్టు చేసినప్పుడు మరో మూడు పిల్లుల్లోనూ యాంటీబాడీలు కనిపించాయి. అంటే వాటికి కూడా కొవిడ్ సోకి, నయమైనట్లు అర్థమైంది.
యజమానుల నుంచి 40 శాతం జంతువులకు వ్యాప్తి!
ఇన్ఫెక్షన్ సోకిన తోటి జంతువులు గల ఇళ్లల్లోనే మరో ఎనిమిది కుక్కలు, పిల్లులు ఉంటున్నప్పటికీ వాటికి కొవిడ్ సోకలేదు. అంటే తోటి జంతువులనుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకడం లేదని తేలింది. మొత్తంగా 196 ఇళ్లల్లోని 40 (20.4 శాతం) జంతువుల్లో యాంటీబాడీలు కనిపించాయి. దీనర్థం యజమానులు కొవిడ్ బారిన పడ్డప్పుడు, వారితో సహవాసం చేసే పెంపుడు జంతువులకు కూడా ఎక్కువగా వైరస్ సోకిందన్నమాట. అలాగే సాధారణంగా కొవిడ్ మనుషుల నుంచి జంతువులకే సోకుతోందన్నమాట. ఒక జంతువు నుంచి మిగతావాటికి వైరస్ సోకుతున్నట్టు కనిపించలేదు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎక్కడా జంతువులు వైరస్ను వ్యాపింపజేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని పరిశోధకులు తెలిపారు. అందువల్ల కొవిడ్ సోకినప్పుడు యజమానులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వారు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్