పాఠశాలలపై కరోనా పంజా
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. వివిధ జిల్లాల్లోని విద్యాకేంద్రాల్లో మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి....
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. వివిధ జిల్లాల్లోని విద్యాకేంద్రాల్లో మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 11 విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలోని 88 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 11 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలింది. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ముథోల్లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు వైరస్ సోకింది. కరోనా వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నాగర్కర్నూల్ పురపాలక పరిధిలోని ఉయ్యాలవాడ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. శనివారం మరో 12 మందికి వ్యాధి నిర్ధరణ అయ్యింది. దీంతో పాఠశాలలో మొత్తం బాధితుల సంఖ్య 16కు చేరింది. శుక్రవారం 83 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి వైరస్ సోకినట్లు తేలింది. శనివారం 300 మందికి పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్గా తేలింది. వైరస్ను అరికట్టేందుకు పాఠశాలలో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. తమ్మాజిపేట ప్రభుత్వోన్నత పాఠశాలలోనూ ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్గా తేలగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు