Omicron: పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా?.. తల్లిదండ్రుల్లో కొత్త దిగులు!
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ముఖ్యంగా రెండో వేరియంట్ ప్రమాదకర స్థాయిలో దేశాన్ని కమ్మేసింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజా జీవనం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ముఖ్యంగా రెండో వేరియంట్ ప్రమాదకర స్థాయిలో దేశాన్ని కమ్మేసింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజా జీవనం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోకి ప్రవేశించిన వేళ ఈ భయాలు ఎక్కువయ్యాయి. అయితే, స్కూళ్లకు పంపే విషయంలో ఇప్పటి వరకైతే తల్లిదండ్రులు పెద్దగా సంశయించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
* కొవిడ్ మొదటి, రెండో ఉద్ధృతి సమయంలో పెద్ద వయసు వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. పిల్లల్లో మాత్రం పరిమిత స్థాయిలోనే ఈ లక్షణాలు బయటపడ్డాయి. దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు మాత్రమే వారిలో కనిపించాయి. పిల్లల్లో పెద్దగా ఆస్పత్రి పాలైన దాఖలాలు లేకపోవడం ఊరట కలిగించే అంశం.
* దేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, వివిధ సీరోలాజికల్ సర్వేల్లో మాత్రం చిన్నారుల్లో కూడా కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. కొందరు చిన్నారులు ఇదివరకే ఇన్ఫెక్షన్ బారిన పడిన వారే కాబట్టి.. కొత్తగా వైరస్ సోకే అవకాశాలు తక్కువేనని ఎపిడమాలజిస్టులు అంటున్నారు.
* మరోవైపు దేశాన్ని ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో స్కూళ్లు మళ్లీ మూత పడతాయా? అనే అనుమానాలు చాలా మంది తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల తీవ్రస్థాయి వ్యాధి లక్షణాల బారిన పడిన ఉదంతాలు ఇంకా బయటపడని నేపథ్యంలో అలాంటి భయాలు పెద్దగా అక్కర్లేదని చెబుతున్నారు వైద్యులు. ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్న వారికీ మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ సోకుతున్నట్లు తేలినా, పాజిటివిటీ రేటు పెరిగిన సందర్భంలో స్కూళ్లు మూసివేయాలని మాత్రం సూచిస్తున్నారు. కరోనాకు ముందు కూడా వాతావరణంలోని వివిధ వైరస్ల వల్ల పిల్లలు ఏడాదిలో రెండు మూడుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ముంబయికి చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ లాన్స్లెట్ పింటో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
* పిల్లల్లో కొవిడ్ అంత ప్రమాదకరం కానప్పటికీ వారి విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం డాక్టర్ పింటో సూచించారు. మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడకం విషయంలో వారికి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు సైతం తగిన గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థికి, విద్యార్థికి మధ్య దూరం ఉండేలా చూసుకుంటే కొవిడ్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?