Antibodies: కొవిడ్ సోకిన చిన్నారులకు.. యాంటీబాడీలతో ఎంతకాలం రక్షణ..?
వైరస్ బారినపడి కోలుకున్న పిల్లల్లో సహజంగా వృద్ధి చెందే యాంటీబాడీలు ఏడు నెలల పాటు రక్షణ కల్పిస్తాయని అమెరికాలో జరిపిన అధ్యయనం వెల్లడించింది.
అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం
వాషింగ్టన్: కొవిడ్-19 నుంచి కోలుకున్న వారికి రీ-ఇన్ఫెక్షన్ బారిన పడకుండా యాంటీబాడీలు కొంతకాలం రక్షణ కలిగిస్తాయని పరిశోధనలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, చిన్నారుల్లో ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇప్పటివరకు సరైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో వైరస్ బారినపడి కోలుకున్న పిల్లల్లో సహజంగా వృద్ధి చెందే యాంటీబాడీలు ఏడు నెలల పాటు రక్షణ కల్పిస్తాయని అమెరికాలో జరిపిన అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన వివరాలు పిడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
చిన్నారుల్లో కొవిడ్ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే అంశంపై అమెరికా టెక్సాస్లోని కేర్స్ సర్వే బృందం అధ్యయనం చేపట్టింది. వ్యాక్సిన్ పంపిణి చేపట్టకముందే జరిపిన ఈ అధ్యయనంలో మొత్తం 218 మంది చిన్నారులను పరిగణనలోనికి తీసుకుంది. ఇందులో భాగంగా 5 నుంచి 19ఏళ్ల వయసుగల కొవిడ్ బారినపడిన చిన్నారుల రక్త నమూనాలను సేకరించి మూడు స్థాయిల్లో పరీక్షించింది. తద్వారా కొవిడ్ బారినపడిన 96శాతం పిల్లల్లో సహజంగా వృద్ధి చెందిన యాంటీబాడీలు ఏడు నెలలపాటు ఉంటున్నట్లు తేలిందని పరిశోధకులు గుర్తించారు. అయితే, కొందరిలో ఆరు నెలల తర్వాత ఈ రక్షణ తగ్గుతున్నందున.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని సూచించారు.
చిన్నారుల్లో కొవిడ్ యాంటీబాడీలపై ఈ తరహా అధ్యయనం ఇదే తొలిసారి అని టెక్సాస్ కేర్స్ సర్వే బృందానికి నేతృత్వం వహించిన ఎపిడమాలజిస్ట్ సారా మెసయా వెల్లడించారు. ఇందులో కొవిడ్ లక్షణాలు కనిపించని, తీవ్ర లక్షణాలున్న వారిని, బాలబాలికలు, మధుమేహం ఉన్న వారిని.. ఇలా భిన్న వర్గాల పిల్లల్ని పరిగణనలోనికి తీసుకొని పరిశీలించామని చెప్పారు. అందుకే ఈ అధ్యయనం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అయితే, కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో సహజంగా వృద్ధి లభించే యాంటీబాడీలకు తోడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే రక్షణ మరింత ఉత్తమమైందని అమెరికా పరిశోధకులు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి