Simhachalam: అప్పన్న ఆలయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే!
రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సింహాచలం అప్పన్న ఆలయంలో ఇవాళ్టి నుంచి కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు.
భక్తులు పాటించాల్సిన నిబంధనలివే..
* అంతరాలయం దర్శనాలు, శఠారి, తీర్థం నిలుపుదల
* అన్న ప్రసాదము, ఉచిత ప్రసాదము నిలుపుదల
* అన్ని సేవా టికెట్లు 50శాతానికి తగ్గింపు
* పరిమితంగానే ప్రసాదాల విక్రయాలు
* భక్తులు క్యూలైన్లలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
* గంగధార వద్ద స్నానాలు నిషేధం
* కనుమ పండుగరోజు కొండ కింద జరిగే గజేంద్ర మోక్షం కార్యక్రమం కొండపైనే
* కనుమ రోజు కొండ కింద జరిగే గ్రామ తిరువీధి రద్దు చేస్తున్నట్టు ఈవో తెలిపారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!