స్పోర్ట్స్‌ మీట్‌లో మెరిసిన పాయల్‌ రాజ్‌పుత్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఉత్సాహంగా ముగిసింది. విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తోపాటు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పాల్గొన్నారు....

Published : 02 Feb 2021 23:38 IST

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తోపాటు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పాల్గొన్నారు. పోలీసులే నిజమైన స్టార్లంటూ పాయల్‌ వారి సేవలను కొనియాడారు. ఏడాదికి రెండుసార్లు స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించాలని సీపీ సజ్జనార్‌ను గోపీచంద్‌ కోరారు. ప్రతి ఒక్కరు ఫిట్‌నెప్‌పై దృష్టిసారించాలని గోపీచంద్‌ క్రీడాకారులకు సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు.

ఇవీ చదవండి...

నా భర్త చదివిన పాఠశాల ఫొటో తీయండి

లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికే నిప్పంటించారు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని