Andhra News: సీపీఎస్ రద్దు చేయాలంటూ ఏలూరులో ఉద్యోగుల భారీ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.‘
ఏలూరు అర్బన్: ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.‘సీపీఎస్ ఉద్యోగుల శంఖారావం’ పేరుతో ప్రధాన రహదారిలో ర్యాలీ చేపట్టారు. స్థానిక తితిదే కల్యాణ మండపం నుంచి అగ్నిమాపక కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు ఇది కొనసాగింది.
ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని.. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు సాగారు. ఈ ర్యాలీలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె