Gymkhana Stadium: టికెట్లు అమ్మడం లేదు.. దయచేసి సహకరించండి

భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి గురువారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో..

Updated : 23 Sep 2022 10:33 IST

హైదరాబాద్‌: భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి గురువారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి భౌతికంగా టికెట్లు ఇస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ ప్రకటన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసకున్న క్రికెట్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో మరోసారి జింఖానా స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియానికి చేరుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించేస్తున్నారు. జింఖానా మైదానం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన పోలీసులు.. టికెట్లు అమ్మడం లేదని.. దయచేసి సహకరించాలని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని