HYD: కప్పు టీ ₹1,000.. అదీ హైదరాబాద్లో!
సాధారణంగా టీ ధర ఎంత ఉంటుంది. పది రూపాయాలు. ఖరీదైన కేఫ్ల్లో అయితే టీ ధర వందల్లోనూ ఉంటుంది. కానీ, తాజాగా హైదరాబాద్లోని ఓ కేఫ్ కప్పు టీని రూ. వెయ్యికి విక్రయిస్తోంది. కప్పు టీకి అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా? అది అరుదైన టీ పౌడర్తో తయారు
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా టీ ధర ఎంత ఉంటుంది. పది రూపాయలు. ఖరీదైన కేఫ్ల్లో అయితే టీ ధర వందల్లోనూ ఉంటుంది. కానీ, తాజాగా హైదరాబాద్లోని ఓ కేఫ్ కప్పు టీని రూ. వెయ్యికి విక్రయిస్తోంది. కప్పు టీకి అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా? అది అరుదైన టీ పౌడర్తో తయారు చేస్తోన్న టీ అండి మరి..!
నీలోఫర్ కేఫ్.. హైదరాబాదీలకు సుపరిచితమైన చోటే. ఇక్కడ అనేక రకాల టీలు, బిస్కెట్స్ను విక్రయిస్తుంటారు. కాగా.. ఇప్పుడు బంజారాహిల్స్లోని కేఫ్ బ్రాంచ్లో ప్రత్యేకమైన, ఖరీదైన టీని పరిచయం చేస్తున్నారు. ఈ టీని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడర్తో తయారు చేస్తారట. ఈ అరుదైన టీ పౌడర్ను కేఫ్ యాజమాన్యం వేలంలోపాటలో గెలుచుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేజీన్నర గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడర్ను అసోంలో నిర్వహించిన వేలంలో కేజీ రూ.75వేల చొప్పున కొనుగోలు చేశారు. ప్రత్యేకమైన, అరుదైన రుచిని కస్టమర్లు ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే ఈ టీని పరిచయం చేస్తున్నామని కేఫ్ యాజమాన్యం చెబుతోంది. మీకు ఆ టీ రుచి చూడాలని ఉందా..? మరెందుకు ఆలస్యం ఈ స్పెషల్ టీ ఆఫర్ ముగియకముందే వెళ్లి తాగేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు