మహిళల కోసం ‘సంఘమిత్ర’: సీపీ సజ్జనార్‌

మహిళల కోసం ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని సైబరాబాద్‌ పోలీసులు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా..

Published : 01 Aug 2020 22:57 IST

హైదరాబాద్‌: మహిళల కోసం ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని సైబరాబాద్‌ పోలీసులు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా సీపీ సజ్జనార్‌, అక్కినేని అమల, నమ్రత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కరోనా వల్ల మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల మహిళలు గృహ హింస, సైబర్‌ మోసాల బారిన పడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి సాయం చేసేందుకే ‘సంఘమిత్ర’ కార్యక్రమం ప్రారంభించామని సీజీ సజ్జనార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని