Covid: చనిపోయిన వ్యక్తికి రెండో డోసు మెసేజ్.. మధ్యప్రదేశ్లో ఘటన
మధ్యప్రదేశ్లో చనిపోయిన ఓ వృద్ధుడు తాజాగా కొవిడ్ రెండో డోసు టీకా వేయించుకున్నట్లు మెసేజ్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజ్గఢ్ జిల్లాలో ఇది వెలుగుచూసింది. కొవిడ్ ధ్రువపత్రం కూడా జారీ అయినట్లు ఓ అధికారి వెల్లడించారు. జిల్లాలోని బియోరా..
భోపాల్: మధ్యప్రదేశ్లో చనిపోయిన ఓ వృద్ధుడు తాజాగా కొవిడ్ రెండో డోసు టీకా వేయించుకున్నట్లు మెసేజ్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజ్గఢ్ జిల్లాలో ఇది వెలుగుచూసింది. కొవిడ్ ధ్రువపత్రం కూడా జారీ అయిన అంశం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బియోరా పట్టణానికి చెందిన పురుషోత్తం(78) ఈ ఏడాది మేలో మృతి చెందారు. అయితే, తన తండ్రి ఫోన్ నంబరుకు ఇటీవల రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సందేశం వచ్చిందని ఆయన కుమారుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ సైతం డౌన్లోడ్ అయినట్లు చెప్పాడు.
విచారణకు స్థానిక ఎమ్మెల్యే డిమాండ్..
జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డా.పీఎల్ భగోరియా దీనిపై స్పందిస్తూ.. ఈ విషయమై తనకు సమాచారం అందిందని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కంప్యూటర్లో లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. బియోరా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డా.శరద్ సాహు మాట్లాడుతూ.. ఫోన్ నంబర్ తప్పుగా నమోదు చేసినట్లు భావిస్తున్నామని, పొరపాటును సరిదిద్దుతామని చెప్పారు. మరోవైపు తప్పుడు వ్యాక్సినేషన్ సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బియోరాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర డాంగి ఆరోపించారు. ఇలాంటి కేసులన్నింటిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు