దారి తప్పిన దుప్పి ఎక్కడికి చేరిందంటే..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి  దుప్పి ప్రవేశించింది.

Published : 15 Jul 2021 22:10 IST

అమరావతి: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి  దుప్పి ప్రవేశించింది. ఆవుదూడ గదిలోకి వెళ్లిందని భావించిన కుటుంబ సభ్యులు.. లోపల దుప్పిని చూసి అవాక్కయ్యారు. దుప్పిని లోపలే ఉంచి గదికి తాళం వేశారు. ఆత్మకూరు అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి ఆ దుప్పిని పట్టుకున్నారు. జనావాసాల్లోకి ప్రవేశించే క్రమంలో దుప్పికి గాయాలవడంతో.. అధికారులు దానికి చికిత్స అందించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కనిగిరి రిజర్వ్‌ అటవీ ప్రాంతం లేదా నర్సింహకొండ అటవీ ప్రాంతంనుంచి దుప్పి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని