viral video: ఫుడ్ డెలివరీ బాయ్కి బొట్టు పెట్టి.. అక్షింతలు వేసి..!
ఆకలేస్తోందని ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు.. అది కాస్తా ఆలస్యమైతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. తీరా ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాక అతడిని చెడామడా తిట్టయ్యడమో.. తక్కువ రేటింగ్ ఇవ్వడమో చేస్తుంటాం. కానీ, దిల్లీలో ఈ పెద్దాయన చేసింది వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆకలేస్తోందని ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు.. అది కాస్తా ఆలస్యమైతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. తీరా ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాక అతడిని చెడామడా తిట్టయ్యడమో.. తక్కువ రేటింగ్ ఇవ్వడమో చేస్తుంటాం. మరీ కోపమొస్తే ఆర్డర్ను వెనక్కి తిప్పి పంపిస్తాం. కానీ, దిల్లీకి చెందిన ఈ పెద్దాయన మాత్రం అలా కాదు. గంట ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్కి బొట్టు పెట్టి అక్షింతలు వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
దిల్లీకి చెందిన సంజీవ్ త్యాగి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఓ గంట ఆలస్యంగా జొమాటో డెలివరీ బాయ్ ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చాలా సేపటి నుంచి ఫుడ్ కోసం ఎదురుచూస్తున్న త్యాగికి ఫుడ్ డెలివరీ బాయ్ ఎదురుపడ్డాడు. ఇవాళ తిట్ల వర్షమే అనుకున్న ఆ డెలివరీ బాయ్కి త్యాగి నుంచి వింత అనుభవం ఎదురైంది. 90ల్లో బాలీవుడ్లో వచ్చిన విజయపథ్ చిత్రంలోని ‘ఆయియే ఆప్కా ఇంతిజార్..’ అంటూ సాగే సాంగ్ను ప్లే చేస్తూ డెలివరీ బాయ్కి నవ్వుతూ ఎదురెళ్లారు. నుదుటికి బొట్టు పెట్టి, నెత్తిమీద అక్షింతలు వేసి పార్శిల్ను అందుకున్నారు.
ఈ వీడియో త్యాగి తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ‘దసరా రోజున దిల్లీలో ట్రాఫిక్ విపరీతంగా ఉన్నా ఆర్డర్ అందుకున్నా.. థాంక్యూ జొమాటో’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షల్లో వీక్షించారు. ఆలస్యం అయినందుకు తిట్టకుండా ఇలా వినూత్నంగా వ్యవహరించడం బాగుందని పలువురు కొనియాడారు. జొమాటో బాయ్ సైతం బొట్టు పెట్టించేందుకు హెల్మెట్ తీసి నవ్వుతూ స్పోర్టివ్గా వ్యవహరించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్