Delusion Disorder: అనుమానం పెనుభూతం.. పరిష్కారాలేంటో తెలుసా..?
అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది. ఈ వ్యాధిఉన్న వారు సంతోషంగా ఉండరు. ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం ఒక జబ్బేనని తేల్పి చెప్పింది. ఆధునిక కాలంలో మారిన జీవన సరళిలో ప్రతి ఒక్కరిలోనూ ఈ అనుమానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వంద మందిలో ఒక్కరు ఈ రోగ బాధితులేనని ఓ అంచనా! ఈ అనుమానపు రోగాన్ని సకాలంలో గుర్తించి వైద్య చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి ఉచ్చు నుంచి తొందరగానే బయటపడవచ్చు. వైద్య పరిభాషలో డెల్యూషన్ డిసార్డర్ అని పిలిచే అనుమానపు జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనుమానం అనేది మెదడు చేసే మాయాజాలం. ఈ వ్యాధితో బాధపడేవారు వారు అనుకున్నదే నిజమని నమ్ముతారు. ఎదుటివారు అది నిజం కాదని వారించినా వాళ్లు అనుకున్నదే వాస్తవమని విశ్వసిస్తారు. తనను ఎవరో వెంటాడుతున్నట్లు, తనకు వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నుతున్నట్లు, తనను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నట్లు, తన జీవిత భాగస్వామి ఎవరితోనో ప్రేమలో ఉందని, అక్రమ సంబంధం ఉన్నట్లు భావిస్తారు. మరికొందరు అయితే వారు ఈ లోకంలో అందరికంటే ఉన్నతమైన ప్రత్యేకమైన వ్యక్తిలా అనుకుంటారు. ఇంకొందరు వారికి వారే తక్కువ చేసుకొని వారు ఎందుకు పనికిరామని అనుకుంటూ ఉంటారు. కొందరేమో తమకు విపరీత శక్తులు ఉన్నాయని అనుకుంటారు. మరికొందరు వారికి ఏదో జబ్బు ఉందని వైద్యుని అవసరం ఉందని అనుకుంటూ ఉంటారు. వారి మనసులోకి వచ్చిన దానినే నిజమని అభిప్రాయపడతారు. దాన్నే బలంగా నమ్ముతారు. ఈ అనుమానాలతోనే జీవితాన్ని కూడా అలాగే గడుపుతుంటారు. వారి ఆలోచనలను కుటుంబ సభ్యుల మీద చూపించి వారు ఇబ్బందులు పడే పనులు చేస్తుంటారు.
లక్షణాలు:
తరచూ కోపం వస్తుంటుంది. ఆందోళనగా ఉంటారు. ఒంటరిగా ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడతారు. ఎవరో పిలిచినట్లు అనుకుంటారు. వాళ్లకు ఏదో దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా, ఏవో చప్పుళ్లు వినిపించినట్లుగా ఉంటుంది. తీవ్రంగా ఆలోచనలు ఉన్నవారికి ఈ అనుమానం ఎక్కువగా ఉంటుంది.
కారణాలు:
* వంశపారంపర్యము
* వాతావరణం
* మనుష్యుల మీద నమ్మకం పోవడం
* ఒంటరితనం, నిరాశ
* ఏది కోరుకున్నా దక్కకపోవడం
* పెరిగిన పరిస్థితులు
* స్నేహితులు, బంధువుల వల్ల మోసపోవడం
పరిష్కారాలు ఏంటి?
* వైద్యుల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి.
* ఈ వ్యాధితో బాధపడుతున్నవారి దారిలోకి వెళ్లి వాళ్లకు నచ్చజెప్పాలి. అలాకాకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేదో అయింది అని మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారు మరింత నిరాశకు గురవ్వడమో లేదా కోపానికి గురికావడమో జరుగుతుంది.
* సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకురావాలి. మందులు వాడాలి.
* మందుల వల్ల తగ్గకుంటే సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ చేయించాలి.
* వారి చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం