AP News: రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతివ్వలేం: డీజీపీ

అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర

Updated : 24 Sep 2022 16:27 IST

అమరావతి: అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస నిర్ణయించాయి. దీంతో పాదయాత్రకు అనుమతి కోరుతూ పోలీసులకు రాజధాని రైతులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటే పోలీసులు అనుమతివ్వడంలేదని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఐకాస నేతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని