Ts: నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: డీజీపీ
రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా.......
హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలన్నారు. రెండో డోసు వ్యాక్సిన్కు వెళ్లేవారికి, మొదటి డోసు సమాచారం చూపించిన వారికి అనుతివ్వాలన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు పాసులు జారీ చేయాలని సూచించారు.
అత్యవసర ప్రయాణాలకు సీపీలు, ఎస్పీలు ఈ-పాస్లు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని సూచించారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. ఈ- పాస్ల కోసం https://policeportal.tspolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ సడలింపు వేళల్లో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణాలకే పాస్లు అవసరమని చెప్పారు. అంతర్ జిల్లా లేదా అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. బయలుదేరే ప్రాంతం పరిధిలోకి కమిషనరేట్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్