Health: తీపి జబ్బు..ముకుతాడు వేయకపోతే ముప్పు
జీవిత కాల జబ్బు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం తప్పా శాశ్వతంగా తగ్గించుకునే చికిత్స లేదు..రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం వస్తుంది.
ఇంటర్నెట్డెస్క్: జీవిత కాల జబ్బు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప శాశ్వతంగా తగ్గించుకునే చికిత్స లేదు. రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం వస్తుంది. కళ్ల నుంచి కాళ్ల దాకా ప్రతి అవయవాన్ని దెబ్బతీసే ప్రమాదకారి ఇది. ఆహారం, అలవాట్లు, జీవనశైలిలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం తీరుతెన్నులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎండోక్రైనాలజిస్టు శ్రీనివాస్ కందుల వివరించారు.
అవగాహన కీలకం: మధుమేహం ఉన్న వారిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం టైప్-1, టైప్-2 రకాలు. ఎక్కువ మందికి టైప్-2 మధుమేహం వస్తుంది. టైప్-1 వంశపారంపర్యంగా వస్తుంది. టైప్-2 వారి జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, బరువు అధికంగా ఉండటంతో జబ్బు వస్తుంది. వీరికి ముందుగా మందులతో నియంత్రించినా క్రమేపి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది.
లక్షణాలు ఇవీ: ఎక్కువ షుగర్ ఉండటంతో తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఎక్కువ దాహం వేయడం, అత్యధికంగా బరువు తగ్గిపోవడం, అరికాళ్లలో మంట ఉండటం, చూపు మందగించడం లాంటి సమస్యలు కనిపిస్తాయి.
ప్రమాదకరం ఎందుకంటే: మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోవడంతో దాని ప్రభావం అనేక అవయవాలపై పడుతుంది. రెటినోపతిలో చూపు మందగిస్తుంది. నెప్రోపతిలో కిడ్నీలు దెబ్బతింటాయి. న్యూరోపతిలో నరాలు దెబ్బతినడంతో నడవడం కష్టంగా ఉంటుంది. గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్ వచ్చే ప్రమాదం రావచ్చు.
పరీక్షలు ఇవీ: పాస్టింగ్, పోస్ట్లంచ్ గ్గూకోజ్ పరీక్ష, హెచ్బీఏవన్సీ, క్రియాటిన్, ప్రోటీన్, కంటి పరీక్షలు ఏడాదికోసారైనా చేసుకోవాలి. నీరసం, గుండెలో నొప్పిగా ఉంటే ఈసీజీ, ఎకో పరీక్షలు చేయించాలి.
అదుపులో ఇలా: మంచి ఆహార శైలి, రోజూ వ్యాయామం చేయడం అవసరం. మందులు తప్పనిసరిగా వేసుకోవాలి. చక్కెర శాతాన్ని తరచుగా పరీక్షించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM