ఎక్కువసేపు కూర్చుంటున్నారా? ప్రమాదకరమండీ..!
గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే వీపు, నడుము, కాళ్లు నొప్పి పెడతాయి. శారీరక శ్రమ లేకపోవడంతో బరువు పెరుగుతారు. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలే. అయితే, అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నొప్పి, బరువు పెరగడమే కాదు.. గుండె జబ్బు, క్యాన్సర్
ఇంటర్నెట్ డెస్క్: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే వీపు, నడుము, కాళ్లు నొప్పి పెడతాయి. శారీరక శ్రమ లేకపోవడంతో బరువు పెరుగుతారు. కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలే ఇవి. అయితే, అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నొప్పి, బరువు పెరగడమే కాదు.. గుండె జబ్బు, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశముందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఎక్కవ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ మేరకు ఒక నివేదికను రూపొందించారు.
* ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడకకు ప్రధానమైన కాళ్ల కండరాలు బలహీనపడతాయి. దీంతో కింద పడ్డా.. వ్యాయామం చేసే సమయంలో కాళ్లకు చిన్న దెబ్బ తగిలినా కండరాలు మరింత క్షీణిస్తాయట. దీంతో నడవడానికి కాళ్లు సహకరించక చచ్చుబారిపోతాయని పరిశోధకులు తెలిపారు.
* కండరాల కదలిక.. మనం తీసుకునే ఆహారం జీర్ణం అవడంలో దోహదపడుతుంటుంది. కానీ, శారీరానికి ఎలాంటి పని చెప్పకుండా కూర్చొనే ఉంటే.. కండరాల కదిలిక లేక ఆహారం సరిగా జీర్ణం అవదు. దీంతో కొవ్వు, గ్లూకోజ్ శరీరంలో అధిక మొత్తంలో నిల్వ ఉండిపోతాయి. ఆ కొవ్వు రక్తనాళాలకు అంటుకుపోయి.. రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీంతో గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరగక.. గుండె జబ్బులు లేదా గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి.
* గంటలతరబడి కూర్చోవడం ద్వారా శరీరంలో పలు రకాల క్యాన్సర్లు అభివృద్ధి అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్దపేగులో క్యాన్సర్ రావొచ్చని వెల్లడించారు.
మరి ఏం చేయాలి?
వీలైనంత ఎక్కువగా నిలబడటానికి ప్రయత్నించండి. కూర్చొని పనిచేస్తున్నా.. ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకొని నిలబడండి. ఫొన్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు అటుఇటు నడుస్తూ మాట్లాడండి. టీవీ చూస్తే.. నిలబడి చూడండి. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల ఇంట్లో కార్యాయాలయాల్లో ఉండే డెస్క్లు ఉండవు. కాబట్టి ల్యాప్టాప్ను ఎత్తులో పెట్టుకొని నిలబడి పనిచేయడానికి ప్రయత్నించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..