Guinness World Record: ఆయన కాళ్లు కాదు.. చేతులే గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాయి!
జియాన్ క్లార్క్ (23) అనే దివ్యాంగుడు చేతులతోనే వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డును సృష్టించారు
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పరుగు పందెంలో రికార్డు బద్దలు కొట్టడం తెలుసు. కానీ, ఓ దివ్యాంగుడు చేతులపై వేగంగా పరుగెత్తి ఓ రికార్డును నెలకొల్పితే..! చేతులతో పరుగెత్తడం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. జియాన్ క్లార్క్ (23) అనే దివ్యాంగుడు చేతులతోనే వేగంగా పరిగెత్తి గిన్నిస్ రికార్డును సృష్టించారు. అమెరికాకు చెందిన దివ్యాంగుడు జియాన్ క్లార్క్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తాజాగా చోటు దక్కించుకున్నారు. చేతులపై 20 మీటర్ల దూరాన్ని కేవలం 4.78 సెకన్లలో చేరుకుని ఆయన ఈ ఘనత సాధించారు. అయితే, క్లార్క్ ఫిబ్రవరిలోనే ఈ రికార్డును సృష్టించగా.. గ్లోబల్ ఆర్గనైజేషన్ వారు తాజాగా గుర్తించి గిన్నిస్ రికార్డుల్లోకి చేర్చారు.
జియాన్ క్లార్క్ కాళ్లు లేకుండానే జన్మించారు. దీనికి కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ కారణమని అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. దివ్యాంగుడిగా క్లార్క్ ఎప్పుడూ బాధపడలేదు. తన స్కూల్ డేస్లోనే రెజ్లర్గా రాణించారు. అంతేకాకుండా ఆయన ఇతరుల్లో స్ఫూర్తి నింపే ఒక వక్తగా, రచయితగా, ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా.. క్లార్క్ చిన్నతనం నుంచి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ పెరిగారు. కానీ, ఆయన దేనికి వంకలు పెట్టకూడదనే నినాదంతో ముందుకు సాగారు. క్లార్క్ ప్రస్తుతం 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్పై దృష్టి సారించారు. ఆయన రెజ్లింగ్, వీల్ చేర్ రేసింగ్ (పారాలింపిక్స్)లో పోటీ చేసి అమెరికన్ అథ్లెట్గా ఎదగాలనుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.