మాస్కు ఎందుకు పెట్టుకోవడంలేదంటే..!
కొవిడ్ కట్టడిలో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడంపై ప్రభుత్వం, వైద్యులు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
దిల్లీ: కొవిడ్ కట్టడిలో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడంపై ప్రభుత్వం, వైద్యులు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. చాలామంది మాస్కులు లేకుండానే సంచరిస్తున్నారు. అయితే వారంతా మాస్కులు ఎందుకు ధరించడం లేదనే అంశానికి సంబంధించి మూడు ముఖ్యమైన కారణాలు తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే చేసింది. అందులో ప్రధానంగా ఎక్కువ మంది మాస్కులు ధరించకపోవడానికి ఈ కారణాలను వెల్లడించారు. మాస్కులు పెట్టుకుంటే తమకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని కొందరు చెప్పారు. మాస్కులు ధరించడం అసౌకర్యంగా ఉందంటూ మరికొందరు చెప్పారు. భౌతిక దూరం పాటించినంత కాలం తమకు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాస్కులు ధరించినంత మాత్రాన కొవిడ్ను అడ్డుకోలేమంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపైనా కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మూడో దశ ముప్పు తప్పదంటూ కేంద్రం చేసిన హెచ్చరికను పెడచెవిన పెడుతున్న ప్రజల నిర్లక్ష్య ధోరణిని సైతం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ధర్డ్ వేవ్పై తాము చెబుతున్న అంశాలను వాతావరణ నివేదికలుగా కొందరు భావిస్తున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు