ED: ఈడీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్గా దినేష్ పరుచూరి నియామకం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ అదనపు డైరెక్టర్గా ఐఆర్ఎస్ అధికారి దినేష్ పరుచూరి నియమితులయ్యారు...
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ అదనపు డైరెక్టర్గా ఐఆర్ఎస్ అధికారి దినేష్ పరుచూరి నియమితులయ్యారు. తెలంగాణ, ఏపీ పరిధితో కూడిన ఈడీ డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్కు దినేష్ పరుచూరి నేతృత్వం వహిస్తారు. ఐఆర్ఎస్ 2009 బ్యాచ్ అధికారి అయిన దినేష్.. గత నెల 31న డిప్యూటేషన్పై ఈడీలో చేరారు. అంతకు ముందు ఆదాయపన్నుశాఖ, ఏపీ ట్రాన్స్కోలో పనిచేశారు. ప్రస్తుత జాంయిట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ముంబయి రెండో జోన్ జేడీగా బదిలీ అయ్యారు. పనాజీ, రాయ్పూర్ జోన్లకు కూడా గోయల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ముంబయి రెండో జోన్ జేడీగా ఉన్న యోగేష్ శర్మ దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. సుమారు మూడేళ్లుగా హైదరాబాద్ జేడీగా పనిచేసిన కర్ణాటక బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ గోయల్.. లోన్ యాప్లు, క్వారీ, ఈఎంఎస్, అగ్రిగోల్డ్, క్యాసినో, టాలీవుడ్ డ్రగ్స్ తదితర కీలక కేసుల దర్యాప్తులను పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’