ED: ఈడీ హైదరాబాద్‌ అదనపు డైరెక్టర్‌గా దినేష్‌ పరుచూరి నియామకం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైదరాబాద్‌ అదనపు డైరెక్టర్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి దినేష్‌ పరుచూరి నియమితులయ్యారు... 

Updated : 10 Aug 2022 18:50 IST

హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైదరాబాద్‌ అదనపు డైరెక్టర్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి దినేష్‌ పరుచూరి నియమితులయ్యారు. తెలంగాణ, ఏపీ పరిధితో కూడిన ఈడీ డైరెక్టరేట్‌ హైదరాబాద్‌ జోన్‌కు దినేష్‌ పరుచూరి నేతృత్వం వహిస్తారు. ఐఆర్‌ఎస్‌ 2009 బ్యాచ్‌ అధికారి అయిన దినేష్‌.. గత నెల 31న డిప్యూటేషన్‌పై ఈడీలో చేరారు. అంతకు ముందు ఆదాయపన్నుశాఖ, ఏపీ ట్రాన్స్‌కోలో పనిచేశారు. ప్రస్తుత జాంయిట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గోయల్‌ ముంబయి రెండో జోన్‌ జేడీగా బదిలీ అయ్యారు. పనాజీ, రాయ్‌పూర్‌ జోన్‌లకు కూడా గోయల్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ముంబయి రెండో జోన్‌ జేడీగా ఉన్న యోగేష్‌ శర్మ దిల్లీలోని ఈడీ  ప్రధాన కార్యాలయంలో ఇంటెలిజెన్స్‌ విభాగానికి బదిలీ అయ్యారు. సుమారు మూడేళ్లుగా హైదరాబాద్‌ జేడీగా పనిచేసిన కర్ణాటక బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ గోయల్‌.. లోన్‌ యాప్‌లు, క్వారీ, ఈఎంఎస్‌, అగ్రిగోల్డ్‌, క్యాసినో, టాలీవుడ్‌ డ్రగ్స్‌ తదితర కీలక కేసుల దర్యాప్తులను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని