తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్ల బదిలీ

తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న ఆర్‌వీ కర్ణన్‌ను కరీంనగర్‌కు, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న వీపీ గౌతమ్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Published : 20 Jul 2021 01:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న ఆర్‌వీ కర్ణన్‌ను కరీంనగర్‌కు, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న వీపీ గౌతమ్‌ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కె.శశాంకను జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని