AP HighCourt: ఉపాధ్యాయుల బదిలీల తుది జాబితా వెల్లడించొద్దు: ఏపీ హైకోర్టు

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలపై వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 27 Apr 2023 23:56 IST

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. జీవో 187లోని బదిలీ మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బదిలీ మార్గదర్శకాలు సరిగా లేవని గతంలోనే ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తుది జాబితా వెల్లడించవద్దని ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. టీచర్ల బదిలీ మార్గదర్శకాలు మళ్లీ రూపొందిస్తామని కోర్టుకు తెలిపారు.   

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని