ఆగిపోయిందనుకున్న గుండె మళ్లీ కొట్టుకుంది!

మృత్యువు అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతి చెందాడని భావించి వైద్యులు పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆగిపోయిందనుకున్న అతడి గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది....

Published : 03 Mar 2021 16:19 IST

బెంగళూరు: మృత్యువు అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతి చెందాడని భావించి వైద్యులు పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆగిపోయిందనుకున్న అతడి గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా మహాలింగపురలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగింది. శంకర్‌ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురికాగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మహాలింగపుర ప్రభుత్వ దవాఖానాకు మార్చారు. ఆసుపత్రి వర్గాలు శంకర్‌ మృతి చెందినట్లు వెల్లడించి పోస్టుమార్టం కోసం సిద్ధమవుతుండగా అతడి కాళ్లల్లో కదలిక వచ్చింది. దీంతో బంధువులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని