Twins : కవలల్లో తొలి శిశువు మృతి.. 52 రోజుల తర్వాత రెండో బిడ్డ పుట్టింది!
ఒడిశా రాష్ట్ర వైద్య చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కవలలకు జన్మనివ్వాల్సిన ఓ గర్భిణి 23 వారాలకే ఓ మృత శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 52 రోజులకు ఆమెకు మరో పండంటి మగబిడ్డ పుట్డడం సంచలనంగా మారింది.
కటక్ : ఒడిశా రాష్ట్ర వైద్య చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కవలలకు జన్మనివ్వాల్సిన ఓ గర్భిణి 23 వారాలకే ఓ మృత శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 52 రోజులకు ఆమెకు మరో పండంటి మగబిడ్డ పుట్డడం విశేషం.
కటక్ జిల్లా కెండుపట్నాకు చెందిన పార్వతి బెహరా(31) ఓ ఐవీఎఫ్ సెంటర్లో చికిత్స చేయించుకుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆమె గర్భంలో రెండు పిండాలు ఏర్పడ్డాయి. 23 వారాల తర్వాత(అక్టోబర్ 29న) నొప్పులు రావడంతో కేసు తీవ్రతను ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు గుర్తించి భువనేశ్వర్లోని కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్)కు సిఫారసు చేశారు. దీంతో అక్కడి వైద్యులు(doctor) ఆమెకు వైద్యం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే దురదృష్టవశాత్తూ గర్భంలోని కవలల్లో ఒక శిశువు(baby) మృతిచెందింది. ఆ పిండాన్ని తొలగించారు. అప్పటికి ఆ బిడ్డ బరువు కేవలం 550 గ్రాములు మాత్రమే ఉంది. దీంతో మరో శిశువును క్షేమంగా బతికించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓ వైపు ఆ గర్భిణి మధుమేహంతో బాధపడుతోంది. మరో వైపు ఒబెసిటీ, హైపోథైరాయిడ్ వంటి ప్రతికూల అంశాలు కూడా తోడయ్యాయి. అయినప్పటికీ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి చికిత్స చేశారు. దీంతో పార్వతి డిసెంబరు 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ(birth) 1370 గ్రాములు మాత్రమే ఉండటంతో చిన్నపిల్లల వార్డులో 48 గంటలపాటు ఆక్సిజన్ అందించారు. కొన్ని రోజులపాటు ముక్కుతో మాత్రమే ఆహారం ఇచ్చారు. బిడ్డ బరువు పెరగడం, ఆరోగ్యంగా ఉండటంతో తర్వాత నోటి ద్వారా ఆహారం ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మన దేశంలో ఇలాంటి ఘటనలు రెండు, మూడు మాత్రమే చోటు చేసుకోగా.. ఒడిశాలో జరగడం ఇదే ప్రథమం అని అక్కడి వైద్యులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్