Lionel Messi: తనకోసం 3 లక్షల జనం వేచి ఉంది నిజమేనా..?
ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బార్సిలోనా క్లబ్తో ఉన్న అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ సందిగ్ధతకు తెరదించుతు మెస్సీ పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) క్లబ్లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బార్సిలోనా క్లబ్తో ఉన్న అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ సందిగ్ధతకు తెరదించుతూ మెస్సీ పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) క్లబ్లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఫ్రాన్స్లోని ఫుట్బాల్ అభిమానులు సంబరాలు చేసుకున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెస్సీకి స్వాగతం పలికేందుకు 3 లక్షల మందికి పైగా ప్రజలు పారిస్ వీధుల్లో గుమిగూడి ఉన్నారనే వీడియో వైరల్గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 2.8 లక్షల మంది వీక్షించారు. కానీ, మెస్సీ కోసం అంత పెద్ద సంఖ్యలో జనం పోటెత్తి రావడం నిజం కాదని నెట్టింట్లో మరొక వీడియో తెగ షేర్ అవుతోంది.
అసలు నిజం ఏంటంటే..?
మెస్సీ గురించి క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న వీడియో ఫేక్ అని తేలింది. వారంతా మెక్కా స్పోర్ట్స్ బార్లో జరుగుతున్న మ్యాచ్ చూడటానికి వచ్చిన వారట. ఆ వీడియో మొదట్లో మెక్కా అని రాసి ఉన్నట్లుగా కనుగొన్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ను కూడా తెలుసుకున్నారు. ఈ వీడియో నిజానికి ఎన్బీఏ టీమ్, మిల్వాకీ బక్స్ టీం మధ్య జరుగుతున్న మ్యాచ్ చూడటానికి వచ్చినప్పుడు తీసిందని తెలిసింది. ఈ మ్యాచ్ అనంతరం వీధుల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడి సంబరాలు జరుపుకొన్నారు. ఆ వీడియోనే ఇప్పుడు మెస్సీ కోసం ఎదురుచూస్తున్నారంటూ సృష్టించి నెటిజన్లను తప్పుదోవ పట్టించారని తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు