ఆ పార్టీ గుర్తులతో దోశలు..!

శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు భిన్న రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొల్లాం బీచ్‌ రోడ్‌లోని ఓ హోటల్‌ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు...

Updated : 22 Mar 2021 11:23 IST

తిరువనంతపురం: శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు వైవిధ్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కొల్లాం బీచ్‌ రోడ్‌లోని ఓ హోటల్‌ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు ఎన్నికలనే మార్గంగా చేసుకున్నారు. ప్రధాన పార్టీల గుర్తులతో అల్పాహారం తయారు చేస్తూ గిరాకీ పెంచుకుంటున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అల్పాహార ప్రియులను మరింత ఆకట్టుకునేలా రాజకీయపార్టీ గుర్తులతో దోశలను తయారు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్‌, భాజపా గుర్తులతో ఈ దోశలు వేస్తున్నారు. దోశలపై పార్టీ గుర్తులను వేసేందుకు క్యారెట్‌ ముక్కలు, టొమాటో సాస్‌ వాడుతున్నారు. ఈ వినూత్న దోశలకు ఎన్నికల వేళ డిమాండ్‌ పెరిగిందని, గతం కన్నా ఎక్కువ ఆర్డర్లు వస్తున్నట్లు హోటల్ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని