ఆ పార్టీ గుర్తులతో దోశలు..!
శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు భిన్న రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొల్లాం బీచ్ రోడ్లోని ఓ హోటల్ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు...
తిరువనంతపురం: శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు వైవిధ్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కొల్లాం బీచ్ రోడ్లోని ఓ హోటల్ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు ఎన్నికలనే మార్గంగా చేసుకున్నారు. ప్రధాన పార్టీల గుర్తులతో అల్పాహారం తయారు చేస్తూ గిరాకీ పెంచుకుంటున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అల్పాహార ప్రియులను మరింత ఆకట్టుకునేలా రాజకీయపార్టీ గుర్తులతో దోశలను తయారు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్, భాజపా గుర్తులతో ఈ దోశలు వేస్తున్నారు. దోశలపై పార్టీ గుర్తులను వేసేందుకు క్యారెట్ ముక్కలు, టొమాటో సాస్ వాడుతున్నారు. ఈ వినూత్న దోశలకు ఎన్నికల వేళ డిమాండ్ పెరిగిందని, గతం కన్నా ఎక్కువ ఆర్డర్లు వస్తున్నట్లు హోటల్ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా