Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం... నేడే దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. నేటి మధ్యాహ్నం 3.30గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

Published : 29 Jun 2022 02:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. నేటి మధ్యాహ్నం 3.30గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 3 లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్ సైట్, టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని